Saturday, May 4, 2024

బిజెపిలో చేర‌డం లేదు.. ప్ర‌చారం మాత్ర‌మే చేస్తా.. కిచ్చా సుదీప్

నేడు బిజెపిలో క‌న్న‌డ‌స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేర‌నున్నారనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌ని కొట్టిపారేశారు సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న‌ట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అలాగే తాను ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. కష్టకాలంలో బీజేపీ తనకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కష్టకాలంలో బీజేపీ తనను ఆదుకుందని.. ఇప్పుడు వారికి సపోర్టు చేస్తానని తెలిపారు. అయితే తాను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తానని ఎన్నికల్లో పోటీ చేయను అని కిచ్చా సుదీప్ మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న పోలైన ఓట్లను లెక్కింపు జరగనుంది. కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి.కాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement