Friday, April 26, 2024

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన కానిస్టేబుల్

హిందూ ముస్లిం భాయి భాయి అని మరోసారి రుజువు అయింది. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మోసిన్ హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా మోసిన్ మాట్లాడుతూ… పెద్దపల్లిలో హిందూ ముస్లింలు సోదర భావంతో ఉంటారని, రంజాన్ పవిత్ర మాసంలో హిందువులు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత ఏడాది అయ్యప్ప మాలదారులకు భిక్ష ఏర్పాటు చేశానని, ప్రస్తుతం హనుమాన్ మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. పెద్దపల్లిలో గణపతి శోభాయాత్ర సమయంలో సైతం ముస్లిం సోదరులు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement