Monday, April 29, 2024

సామాజిక న్యాయం కోసం కృషిచేసిన మ‌హ‌నీయుడు జగ్జీవన్ రామ్.. శ్రీలత శోభన్ రెడ్డి

సామాజిక న్యాయం కోసం కృషిచేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రావ్ 116వ జయంతి సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… భారత ఉప ప్రధానిగా దేశానికి సేవలు చేశారని, దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ కార్మిక విభాగపు అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, మహిళా విభాగపు బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement