Tuesday, May 7, 2024

విశాఖ మెట్రో రైలుకు ప్రతిపాదనలే పంపలేదు.. రాష్ట్ర సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించని మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేటాయింపులు కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా అబద్దాలాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాము ప్రతిపాదించని మెట్రో రైల్ గురించి మాట్లాడుతూ రాష్ట్రానికి బడ్జెట్‌లో మెట్రో రైల్ కేటాయింపులు జరగలేదని ప్రశ్నించారని ఆయన తెలిపారు.

అసలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖపట్నం మెట్రో విషయమై కేంద్రానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపకుండా తమకు ఏమాత్రం కేటాయింపులు జరగలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం సమంజసమా అని ప్రశ్నించారు. ఏపీ కంటే ఎంతో చిన్న రాష్ట్రాలు ఆశావహ దృక్పథంతో అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఏపీ ఇంకా వెనకబడి ఉందని చెప్పడం వారి పాలనకు నిదర్శనమని జీవీఎల్ ఎద్దేవా చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement