Friday, April 26, 2024

భాగ్యనగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల సందడి.

హైదరాబాద్‌ నగరంలో. డబుల్ డెక్కర్ బస్ లు మళ్లీ తిరగనున్నాయి . . గతంలో ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తూ హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టాలని కోరగా కేటీఆర్‌ స్పందిస్తూ త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చిన మాట మేరకు ఎట్టకేలకు నగరంలో డబుల్ డెక్కర్‌ బస్సులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్‌, .సీఎస్ శాంతి కుమారి తో కలసి ప్రారంభించారు.

ప్రస్తుతం ఉన్న మూడు బస్సులను ప్రారంభించగా.. త్వరలోనే 20కి పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎలక్రిక్‌ బస్సు ధర రూ.2.16కోట్లు. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్‌ సామర్థ్యం ఉంది. బస్సు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ నెల 11న ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, ప్యారడైజ్‌, నిజాంకాలేజీ ప్రాంతాల్లో తిరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement