Monday, May 6, 2024

ఇకపై నో క్వారంటైన్‌, చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 8 నుంచి అమల్లోకి

కరోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరిగా అమలు చేస్తున్న చైనా ప్రభుత్వం, ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన జనవరి 8 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ నెగిటివ్‌ ధ్రువపత్రం చూపిస్తే చాలని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

విదేశీయుల కోసమే కరోనా నిబంధనలను సడలించి నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. అయితే, ఇందులో పర్యాటకులను చేర్చలేదు. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లేందుకు చైనా పౌరులను క్రమంగా అనుమతిస్తామని పేర్కొంది. కరోనా కేసులతో అల్లాడిపోతున్న చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫైజర్‌ కొవిడ్‌ టీకా ‘ప్యాక్స్‌లోవిడ్‌’ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో రాజధాని బీజింగ్‌లోని కమ్యూనిటీ ##హల్త్‌ సెంటర్ల ద్వారా ఈ టీకాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. చైనాలో పంపిణీ చేస్తున్న కరోనా టీకాల్లో ప్యాక్స్‌లోవిడ్‌ ఒక్కటే విదేశీ టీకా కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement