Tuesday, April 30, 2024

Business | రిల‌య‌న్స్ నుంచి త‌ప్పుకున్న నీతా అంబానీ.. బోర్డు డైరెక్ట‌ర్ ప‌ద‌వికి గుడ్‌బై

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కంపెనీ బోర్డు నుండి తప్పుకున్నారు. ఇప్పటి వరకు ఆమె బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే వారి పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు బోర్డులోకి వస్తుండటంతో ఆమె తప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. సంస్థ‌లో ఈ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌నున్నారు. 46వ వార్షిక సాధారణ స‌మావేశాల సంద‌ర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ… ఈ నియామ‌కంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లు కోరారు. షేర్ హోల్డ‌ర్ల నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది.

కొన్నేళ్లుగా వీరు ముగ్గురు వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిటైల్, డిజిట‌ల్ స‌ర్వీసులు, ఎన‌ర్జీ రంగాల‌కు చెంద‌ని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిల‌య‌న్స్ అనుబంధ‌ కంపెనీల బోర్డుల్లోనూ వీరు ఉన్నారు. ఇప్పుడు వీరు బోర్డులోకి వస్తున్న నేపథ్యంలో నీతా రాజీనామాను డైరెక్ట‌ర్లు అంగీక‌రించారు. అయితే అన్ని బోర్డు మీటింగ్‌ల‌కు ఆమె ఓ ప‌ర్మ‌ినెంట్ ఇన్వైటీగా హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement