Sunday, April 28, 2024

AP | ఫారెన్‌ పోవాలి, ప‌ర్మిష‌న్ ఇవ్వండి.. సీబీఐ కోర్టులో సీఎం జ‌గ‌న్ పిటిష‌న్‌

యూకే పర్యటనకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ ఆస్తుల‌ కేసులో జ‌గ‌న్‌పై దేశం విడిచి వెళ్లిపోవద్దనే షరతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన యూకే పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తనకు దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు.

కాగా, జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మరోవైపు యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్, సింగపూర్ తదితర విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement