Monday, May 13, 2024

New Record – 45 రోజులలో 12 కోట్ల మంది మహాలక్ష్మిల ప్రయాణం

తెలంగాణలో ‘ఉచిత బస్సు ప్రయాణం’ ఓ చారిత్రక నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. నాంపల్లిలోని తెలుగు వర్శిటీ బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. అయితే, ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో 45 రోజుల్లో 12 కోట్ల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. అనౌన్స్ మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

ఉచిత ప్రయాణం కారణంగా మహిళలు వికలాంగులకు కేటాయించిన సీట్లలో సైతం కూర్చుంటున్నారనేది తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించామని.. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవి అందుబాటులోకి వస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని సజ్జనార్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement