Monday, May 6, 2024

ఈ వారం ఓటీటీలో మూడు కొత్త సినిమాలు

తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సరైన సినిమాలు లేకపోవడం ఒక కారణమైతే.. విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మరో కారణం. దీంతో థియేటర్లకు ఖర్చులు కూడా రావడం లేదు. మరోవైపు విడుదలైన సినిమాలు రెండు వారాల్లోనే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇప్పటికే మెరిసే మెరిసే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ వారం పలు కొత్త సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.

ఈనెల 28న సత్యదేవ్ నటించి ‘తిమ్మరుసు’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మోస్తరు కలెక్షన్‌లను సాధించింది. హిట్ టాక్ వచ్చినా కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూసేందుకు నిరాకరించారు. దీంతో ఓటీటీలో వస్తే చూసేందుకు వారు ఆత్రుతగా ఉన్నారు. మరోవైపు థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ఎస్.ఆర్.కళ్యాణమండపం. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో నటించాడు. సాయికుమార్ ప్రధానపాత్ర పోషించాడు. ఈ మూవీ ఆహా ఓటీటీలో ఈనెల 28న స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలే కాకుండా నేరుగా ఓటీటీ ప్రేక్షకులను మరో సినిమా పలకరించనుంది. ఆ మూవీనే ‘వివాహ భోజనంబు’. హీరో సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో కమెడియన్ సత్య కీలక రోల్ పోషించాడు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 27 నుంచి సోనీ లైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వార్త కూడా చదవండి: సూర్య సరికొత్త రికార్డ్.. సోషల్ మీడియాలో హవా

Advertisement

తాజా వార్తలు

Advertisement