Monday, May 6, 2024

నేపాల్‌ పార్లమెంట్‌ రద్దు.. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు..

నేపాల్‌ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విపక్ష కూటమి ముందుకు వచ్చింది. అయితే, విపక్ష అభ్యర్థనను అధ్యక్షురాలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు షేక్‌ బహదూర్‌ దేవ్​బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ మేరకు నేపాల్‌ అధ్యక్షురాలి కార్యాలయం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేశారని, మొదటి సాధారణ ఎన్నికలు నవంబర్‌ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. అయితే, విపక్ష అభ్యర్థనను అధ్యక్షురాలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్‌ కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్నది. రోజుకు సగటున 8వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement