Wednesday, April 24, 2024

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు: నారా లోకేష్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని జగన్ రెడ్డి కుట్రలు చేస్తుంటే.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి స్టీల్ ప్లాంట్ కార్మికులు కరోనా రోగులకు ఊపిరి పోశారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీలో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పోరాడాలన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement