Friday, April 26, 2024

నా ప్రాణాలకు ముప్పు ఉంది, భద్రత పెంచండి.. డీజీపీకి అచ్చెన్న లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ : సంఘవిద్రోహ శక్తులు, నక్సల్స్‌, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణహాని ఉందని.. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. బుధవారం ఈ మేరకు ఆయన డీజీపీకి ఒక లేఖ రాశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు విస్తృత పర్యటనలను చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నానని ఈ నేపథ్యంలో తనకు కల్పిస్తున్న భద్రతను పున:సమీక్షించి అదనపు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తనకు వన్‌ ప్లస్‌ వన్‌ భద్రత ఉందని దానిని ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌గా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీఎల్పీ ముఖ్యనేతగా వ్యవహరిస్తున్న తరుణంలో తన విజ్ఞప్తి మేరకు అవసరమైన భద్రతను క ల్పించాలని అచ్చెన్నాయుడు లేఖ ద్వారా డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement