Tuesday, May 21, 2024

బోర్డుతిప్పేసిన ముద్ర బ్యాంకు..

నల్లబెల్లి ప్రభన్యూస్: నల్లబెల్లి ముద్ర బ్యాంకు శాఖ మేనేజర్ ఓదెల చరణ్, వారి సిబ్బందిని నిర్బంధించారు. నల్లబెల్లి శాఖలో 150 మంది సభ్యులను చేర్చుకొని రోజువారి నెలవారి పద్ధతిలో డబ్బులు కట్టించుకున్నారు. దాదాపు సంవత్సరంన్నరగా వ్యాపారం చేస్తూ రూ. 45 లక్షలు వసూలు చేసి సభ్యులకు ఇవ్వకుండా బోర్డు తిప్పేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 235 శాఖలను తెరిచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో ముద్ర బ్యాంకు సిబ్బందిని నిర్బంధించారు.అయితే, సమస్యను పరిష్కారంపై పోలీసులు హామీ ఇవ్వడంతో వారిని విడిచి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement