Saturday, May 4, 2024

ఈనెల 26న అల్వాల్ కు సీఎం కేసీఅర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ నగరానికి నలువైపులా అత్యాధునిక వైద్యశాలలు (tims) ఏర్పాటు చేయబోతోంది. అందులో భాగంగా ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్ లో వైద్యశాల స్థలాన్ని, సభ ప్రాంగణాన్ని మంత్రి హరీష్ రావు తో కలిసి మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్ రావు, సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement