Sunday, May 5, 2024

త్యాగాలకు ప్రతీక మొహర్రం.. సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : త్యాగాలకు ప్రతీక మొహర్రం పండుగ అని సీఎం కేసీఆర్‌ కీర్తించారు. నాటికాలంలో ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుస్సేన్‌ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందని పేర్కొన్నారు. త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రం రుపుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

పీర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహర్రం నిలిచిందన్నారు. హిందువులు హసన్‌, హుస్సేన్‌లను ఆశన్న, ఊశన్నలనే పేర్లతో పీరీలను ఎత్తుకొని పాటలు పాడుకుంటూ, ఆనాటి వారి త్యాగాలను పేరుపేరునా కీర్తిస్తూ, త్యాగానికి చిహ్నంగా నిప్పుల గుండాలపై నడుస్తారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచి, దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్పూర్తిని మొహర్రం నింపుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement