Wednesday, May 1, 2024

చెన్నైలోని హనుమాన్ ఆల‌యంలో క‌విత పూజ‌లు..

చెన్నై – చెన్నై లో సీనియ‌ర్ న‌టుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైకు వ‌చ్చిన క‌విత ఆ దేవాల‌యానికి వెళ్లారు.. అక్క‌డ ఆమెకు అర్జున్ దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంత‌రం హ‌నుమాన్ ను ద‌ర్శించుకుని తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుడూ, దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని అన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని పేర్కొన్నారు. మిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement