Monday, April 29, 2024

చ‌దువుల‌తోనే పేద‌ల త‌ల‌రాత‌లు మార‌తాయి – జ‌గ‌న్

తాడేపల్లి: గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. క‌ల్యాణ‌మ‌స్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ, ఎస్సీ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంద‌న్నారు. 2022 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చేలా, పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement