Monday, May 20, 2024

ఫ్లైబిగ్‌ విమానానికి తప్పిన ప్రమాదం.. సాంకేతిక లోపంతో రన్‌వేపై నిలిచిపోయిన ఫ్లైట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శాంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని గోండియ వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌ విమానం రన్‌వేపైకి వెళ్లగానే ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వేపైనే విమానాన్ని పైలట్‌ నిలిపివేశారు. అయితే ఈ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ రన్‌వేపైనే ప్రయాణికులు ధర్నాకు దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement