ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టైటిల్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. పేసర్ అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు. అటు, తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు. కాగా, సొంతగడ్డపై అభిమానుల నడుమ ఆడుతుండడం గుజరాత్ టైటాన్స్ కు అదనపు బలం అయినా, టాస్ ఓడిపోవడం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..