Saturday, May 25, 2024

రేపు గోదావరి వరద ఉదృతిని పరిశీలించనున్న మంత్రి పువ్వాడ

ఖమ్మం -:. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చారు.

రేపు 11 గంటల నుండి వరద ఉదృతి తగ్గే వరకు భద్రాచలంలోనే ఉండి మంత్రి పువ్వాడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో . పర్యటించనున్నారు. మంత్రి పువ్వాడతో పాటు గత కలెక్టర్ అనుదీప్ సైతం భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement