Saturday, May 4, 2024

కామారెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను పరామర్శించారు. గంప గోవర్ధన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నెల ౩న గంప గోవర్ధన్ మాతృమూర్తి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కామారెడ్డి జిల్లా, బిక్కనూరు మండలంలోని గంప స్వగ్రామం బస్వాపూర్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ గంప గోవర్ధన్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement