Friday, April 26, 2024

మునుగోడును అద్భుతంగా తీర్చిదిద్దుతాం : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

యాదాద్రి : మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు రుణపడి ఉంటామని చెప్పారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారిని మంత్రి సత్యవతి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మూడున్నరేండ్లలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు లక్ష్మీనరసింహ స్వామి తగిన బుద్ధి చెప్పారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement