Sunday, May 5, 2024

Meditation Center – ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ ను ప్రారంభించిన మోడీ

వార‌ణాసిలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.

ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోడీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడంతో ఆస‌క్తిగా తిల‌కించిన ప్ర‌ధాని… పై క‌ప్పు అలా ఏర్పాటు చేయ‌డంతో ఏదైన ప్ర‌త్యేక‌త ఉందా అని నిర్వ‌హకుల‌ను ప్ర‌శ్నించి వారి నుంచి వివ‌రాల‌ను సేక‌రించారు.
ప్రారంభోత్స‌వ అనంత‌రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోడీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు. అక్క‌డ విశేషాల‌ను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement