Saturday, April 27, 2024

అభివృద్ధిలో ఆద‌ర్శంగా మేడ్చ‌ల్ : మంత్రి మ‌ల్లారెడ్డి

మేడ్చ‌ల్ జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుంద‌ని మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. సోమ‌వారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లా ఫర్జాధిగూడ మునిసిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో తెలంగాణ 2కే రన్ నిర్వహించారు. ఈ రన్ లో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో మేడ్చల్ జిల్లా అన్ని రంగాలలో మోడల్ గా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫిర్జాధిగూడ మేయర్ వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement