Wednesday, May 8, 2024

గాయంతో పోటీనుంచి తప్పుకున్న మేరీకోం, ఫైనల్స్‌కు చేరుకున్న నీతు..

కాలికి గాయం కావడంతో సీనియర్‌ బాక్సర్‌ మేరీకోం శుక్రవారం నాటి 48 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల నుంచి తప్పుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహిస్తున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మేరీకోం పాలుపంచుకుంటున్నారు. అయితే కాలికి గాయమవడంతో తాత్కాలికంగా తప్పుకున్నారు. 48 కిలోల సెమీఫైనల్స్‌ తొలి రౌండ్‌లో పాల్గొంటుండగా గాయపడింది. ఇక హరియాణాకు చెందిన నీతు ఈ పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకుంది.

2018లో స్వర్ణపతకం సాధించిన మేరీ తొలిరౌండ్‌ బౌట్‌ సమయంలో కిందపడింది. అయినప్పటికీ పట్టు విడవలేదు. అయితే పంచ్‌లను కొద్దిసేపు తట్టుకున్నప్పటికీ ఆ తర్వాత బరిలో నిలబడలేకపోయింది. దీంతో మేరీ కోంను ఆస్పత్రికి తరలించారు.వచ్చే నెలలో బర్మింగ్‌హాంలో జరగనున్న పోటీల్లో మేరీ పాల్గొనాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement