Tuesday, May 14, 2024

మార్కులు కాదు ..ఉన్న‌త ల‌క్ష్య సాధనే ముఖ్యం- ట్విట్ట‌ర్ లో క‌లెక్ట‌ర్ తుషార్ సుమేరా 10మార్కుల మెమో

గుజ‌రాత్ బ‌రూచ్ జిల్లా క‌లెక్ట‌ర్ తుషార్ సుమేరా ప‌దో త‌ర‌గ‌తి మార్కుల మెమోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు ఐఏఎస్ అధికారి అవ‌నీష్ శ‌ర‌ణ్. తుషార్ సుమేరాకు పదో తరగతిలో ఇంగ్లిష్ లో కేవలం పాస్ మార్కులు 35 వచ్చాయి. మ్యాథ్స్ లో 36, సైన్స్ లో కూడా 38 మార్కులు మించలేదు. ఈ ఫోటోతో పాటు.. పక్కన బరూచ్ కలెక్టర్ కార్యాలయంలో ఆసీనులైన తుషార్ సుమేరా ఫొటోను అవనీశ్ శరణ్ పోస్ట్ చేశారు. మంచి మార్కుల సాధన దిశగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చే వారికి ఇదొక కనువిప్పు లాంటిదే. ఉన్నత లక్ష్యాల సాధనకు మార్కులు కొలమానం కానే కాదని ఇది తెలియజేస్తోంది. ఈ కథనం ఎంతో మందికి స్ఫూర్తినీయంగా అనిపిస్తోందన్నారు. దాంతో ట్విట్టర్ లో ఎంతో మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement