Sunday, April 28, 2024

త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర రాష్ట్ర‌ ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాణిక్ తో పాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకుంది. మిస్టర్ క్లీన్ గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి స్థానం నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు. అయితే ఈకార్య‌క్ర‌మానికి వామపక్ష కాంగ్రెస్ కూటమి హాజరుకాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement