Friday, April 26, 2024

బాస‌ర అమ్మవారిని దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్ లు

బాసర : మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం బాసర అమ్మవారి సన్నిధికి దేశంలోని వివిధ రాష్ట్ర క్యాడర్లకు చెందిన 15 మంది మహిళా ట్రైనీ ఐఏఎస్ లు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంత‌రం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వీరికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ ఆనవాయితీ మర్యాదలతో స్వాగతం పలికారు. మీపై అమ్మవారి ఆశీస్సులు వుండాలని అర్చన చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంత‌రం వారిని శాలువాతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement