Thursday, April 25, 2024

హోలీ వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని

హొలీ సందర్భంగా నగరంలోని పలుచోట్ల నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మొండా మార్కెట్ డివిజన్ బండి మెట్ లో బ్రస్లీప్ పార్టీ నాయకులు నాగులు ఆధ్వర్యంలో నిర్వహించిన హొలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రికి రంగులతో స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. అక్కడ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా PV మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా, సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లలో నిర్వహించిన హొలీ వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హొలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వివిధ రకాల పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఎంతో సందడి చేశారు. పీపుల్స్ ప్లాజా, జింఖానా గ్రౌండ్ లలో హొలీ వేడుకలకు హాజరైన వారికి మంత్రి హొలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement