Wednesday, May 8, 2024

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయండి.. ప్రభుత్వ ప్ర‌ధాన‌ కార్యదర్శి సోమేష్ కుమార్

రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న రామగుండం వస్తున్నారని, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్ర‌ధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదులోని బీఆర్కే భవన్లో పెద్దపల్లి జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్, హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సివి ఆనంద్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, డిసిపి రూపేష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్ కుమార్, ఆర్ ఎఫ్ సి ఎల్ సి ఓ అలోక్ సింగాల్, మాజీ సీఈవో అతుల్ జైన్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement