Tuesday, May 7, 2024

Maharashtra: వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్ర‌మాదం

ఓ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. గత రాత్రి బివాండిలోని కాజీ కాంపౌండ్ లో ఉన్న వస్త పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పెరుగుతూ ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా పొగ భాగా అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అధికారులు వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో కోట్ల విలువైన దుస్తులు, సామాగ్రి దగ్ధమయ్యాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement