Sunday, April 28, 2024

డిప్రెషన్‌తో ఏడో అంతస్తు నుంచి దూకేశాడు.. ఐఐటీ స్టూడెంట్ ఆత్మహత్య..

ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ విద్యార్థి సోమవారం క్యాంపస్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు (26) మాస్టర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో క్యాంపస్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకినట్లు తెలిపారు.

అతడిని ఘట్‌కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతడి హాస్టల్ నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని, చికిత్స పొందుతున్నానని విద్యార్థి నోట్‌లో పేర్కొన్నాడు. తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయలేదని పోలీసులు నోట్‌ను ప్రస్తావిస్తూ చెప్పారు.
ఈ ఘటనపై పొవాయ్ పోలీసులు యాక్సిడెంట్ డెత్గాకేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement