Sunday, April 28, 2024

రైతుల‌కు శుభ‌వార్త‌.. మ‌హా పాద‌యాత్ర‌కి కోర్టు గ్రీన్ సిగ్న‌ల్..

ఏపీ హైకోర్టు అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు చేప‌ట్ట‌నున్న మ‌హా పాద‌యాత్ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం నినాదంతో చేపట్టదలచిన మహా పాదయాత్రకు ఆంధప్రదేశ్ హైకోర్టు అనుమతినిచ్చింది.రాజధాని రైతులు పాద‌యాత్ర చేసేందుకు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి వాటిని ఉద్యమ నిర్వాహకులు అమలు చేయలేరని…మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిథిలో ఉంద‌ని .. దాని మీద ఆందోళనకు అనుమతించడం వీలుకాదని చెబుతూ పొలీసులు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈవిషయాన్ని ప్రభుత్వన్యాయవాది ప్రస్తావించారు.పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించిన న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. దీనితో పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. అయితేరైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు వెల్లడించారు. అనంతరం షరతులతో పాదయాత్రకు అనుమతినిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement