Saturday, May 4, 2024

Vardhannapet – లారీ – ఆటో ఢీ – ఐదుగురు మృతి

వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ ప్రధాన రహదారిపై అదుపు తప్పిన లారీ ఆటోను ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందారు.. నలుగురు ఘటనాస్థలంలో.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. .స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు తేనె విక్రయించే కూలీలుగా సమాచారం. రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్‌.. మద్యం మత్తులో లారీని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు

వరంగల్ నగరానికి చెందిన వారు తేనేపట్టు అమ్ముకోవడం కోసం ఆటో లో వరంగల్ వైపు నుంచి వర్ధన్నపేట వైపుగా వస్తున్న క్రమంలో వర్ధన్నపేట వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న రాజస్థాన్ కు చెందిన లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను డీ కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement