Monday, April 29, 2024

Lok Sabha Elections డిసెంబ‌ర్ లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు …మ‌మ‌తా బెన‌ర్జీ

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. . ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ముందస్తుగా బుక్‌ చేసుకొందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే ‘నిరంకుశ పాలనే’నని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఇక అక్కడి గవర్నర్‌ తీరుపై మండిపడ్డ ఆమె.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు.. గవర్నర్‌ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు. ఇక ఇటీవల జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో చోటుచేసుకున్న వివాదంపైనా స్పందించిన మమతా ‘గోలీ మారో’ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు. ఇందులో ఎటువంటి మిన‌హాయింపు లేద‌ని తేల్చిచెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement