Monday, April 29, 2024

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : ఎమ్మెల్యే వివేకానంద్

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయనగర్ లో గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదువుకుని విజయాలు సాధించాలని, మన ప్రభుత్వం పేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉన్నత విద్యని ఉచితంగా అందిస్తోందన్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఒకేషనల్ జూనియర్ కాలేజీ, డిగ్రీ, మన జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కూడా మన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అనంతరం దత్తాత్రేయ నగర్ కాలనీ, తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చేసినందుకు అలాగే తమ కాలనీవాసులకు ఎల్లవేళలా అండగా ఉంటూ తన సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కు అభినందనలు తెలియజేసి, ఘనంగా సత్కరించారు. తమ కాలనీవాసులు సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే కే అని తెలియజేస్తూ.. రానున్న ఎన్నికల్లో కె పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటామని కాలనీ వాసులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ యం.డి శ్రీనివాస్ సాధు, ఎంఈఓ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎంఈఓ రమేష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభ, సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, రాముడు యాదవ్, అజయ్, వెంకటేష్, అమర్ వడ్ల, మధు, దత్తాత్రేయ నగర్ సంక్షేమ సంఘం అధ్యేక్షులు స్వామి వడ్ల, అడ్వైసర్ యాదగిరి, అశోక్, గోవిందరాజు, ఉత్తరయ్య, శ్రీనివాస్, మహిళా నాయకురాలు సరస్వతి, సావిత్రి, జరీనా, స్థానికులు, సంక్షేమ సంఘ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement