Saturday, May 4, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. చిరుత మృతి

శెట్టూరు : మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో గ్రామాల్లోకి చిరుతలు ప్రవేశించి, పశువులు, కుక్కలను వేటాడుతున్నాయన్నారు. అటవీశాఖ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరణించిన చిరుతకు రెండు సంవత్సరాల వయసు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement