Sunday, May 12, 2024

ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

ఏపీలో కరోనా కేసులు నిన్నటి కంటే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,546 కరోనా పరీక్షలు నిర్వహించగా 246 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 58 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 45, కృష్ణా జిల్లాలో 37, విశాఖ జిల్లాలో 23, తూ.గో. జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 15, కడప జిల్లాలో 12, శ్రీకాకుళం జిల్లాలో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అత్యల్పంగా ప.గో. జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 131 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రకాశం జిల్లాలో కరోనాతో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,92,986 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,890 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1909గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,187గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement