Monday, April 29, 2024

ఏపీలో కొత్తగా 261 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 23,417 కరోనా పరీక్షలు నిర్వహించగా 261 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 41 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 39 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 37, కృష్ణా జిల్లాలో 34, తూర్పు గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కేసులేవీ నమోదు కాలేదు. అత్యల్పంగా ప.గో. జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 125 మంది కరోనా నుంచి కోలుకోగా ఎవరూ మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,92,269 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,505 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1579గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,185గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement