Friday, April 26, 2024

బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్

తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని బీజేపీ తలపెట్టింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో ప్రారంభించారు. అయితే బీజేపీ తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పోస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తానని ప్రధాని మోదీ గతంలో హామీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, తెలంగాణ ప్రజలు, యువకులు అందరూ తెలంగాణ బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇస్తే.. మీ జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి’ అని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement