Saturday, April 27, 2024

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక భేటీ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సోమవారం భేటీ కానున్నాయి. బోర్డుల చైర్మన్లతో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సందర్భంగా బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై చర్చించనున్నారు. జూలై 15న రెండు బోర్డుల పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణపై రెండు బోర్డులు ఇప్పటికే సంప్రదింపులు జరిపాయి. అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను బోర్డులు కోరాయి. దీంతో కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. గెజిట్‌లోని తమ అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కొన్ని ప్రాజెక్టులను షెడ్యూళ్ల నుంచి మార్చాలని ఇరు రాష్ట్రాలు కోరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement