Tuesday, May 14, 2024

ఆంబోతుల అచ్చెన్న, కుక్కల వెంకన్నకు బెదిరేది లేదు :కొడాలి

అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కామ్ లు చేశారన్నారు మంత్రి కోడలి నాని. చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇవ్వటంపై స్పందించిన మంత్రి కొడాలి నాని … సిఆర్డి ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఓ లతో, దళిత వర్గాలను మోసం చేశారు. అమరావతిలో అసైన్డ్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారన్నారు మంత్రి కొడాలి. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్న, కుక్కల బుద్ధ వెంకన్న మరుగుతున్నా తాము అదిరేది,బెదిరేది లేదన్నారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సి నోటీసులు జారీ చేశారు.రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్ లకు సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే… తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సిఐడి, కోర్టులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement