Thursday, May 16, 2024

Delhi | అమిత్ షా తో కిషన్ రెడ్డి భేటీ..జులై 29న షా హైదరాబాద్ పర్యటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిచి మాట్లాడారు. సోమవారం రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు. అంతకంటే ముందు మధ్యాహ్నం పార్లమెంటులోని హోంమంత్రి ఛాంబర్లో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు. వరుసగా ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29న అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు. ఈలోగా తెలంగాణ ముఖ్య నేతలను పిలిపించి ఏ అంశాలు చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement