Friday, May 3, 2024

Exclusive | చెన్నైలో కిలాడీ లేడీ.. పెళ్లికాని యువకులకు అమ్మాయిల ఎర!

చెన్నైలో కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కానీ, వయసు మీదపడ్డ వారిని టార్గెట్​ చేసుకుని తన యవ్వారం కొనసాగిస్తోంది. మ్యాట్రిమొనీ సైట్​లో యువతుల ఫొటోలతో గాలం వేయడం, ఆ తర్వాత యువకులను మోసం చేయడమే పనిగా పెట్టుకుంది. అయితే.. ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక చాలామంది కామ్​గా ఉండిపోయారు. తాము మోసపోయామని తెలిస్తే ఇజ్జత్​ పోతుందన్న భయంతో బయటపడలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ బాధిత యువకుడు పోలీసులకు కంప్లెయింట్​ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువతి చేస్తున్న మోసాలను మొత్తం బయటపెట్టేశారు.

మ్యాట్రిమొనీ సైట్​లో యువతుల ఫొటోలతో గాలం వేయడం, వయసు పైబడిన పెళ్లికాని యువకులను టార్గెట్​ చేసుకోవడమే ఆమె పనిగా పెట్టుకున్నట్టు నిర్ధారించారు. పరిచయం పేరిట చాలామంది నుంచి నగదు, ఖరీదైన స్మార్ట్​ఫోన్లకు టెండర్ ఆమె టెండర్​ వేసినట్టు తెలుసుకున్నారు. ఇట్లా చెన్నై, బెంగళూరులో పదుల సంఖ్యలో బాధితులున్నారు. మగాళ్ల వీక్​నెస్​ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీ సంధ్యని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement