Sunday, April 28, 2024

ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాప‌న‌..

గండికోట – వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి సీఎం జగమోన్‌హన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. మూడు చోట్ల సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో సీఎం భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఒబెరాయ్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంజద్‌ బాషా, రోజా, ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement