Sunday, May 5, 2024

ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు – డ్రైవ‌ర్ మృతి..

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్‌నగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement