Thursday, May 2, 2024

DK: అధిష్టానంతో ముగిసిన డీకే చర్చలు..హైదరాబాద్​కు పయనం

డీకే శివకుమార్ అధిష్టానంతో జరిపిన చర్చలు ముగిశాయి. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎవరు అనే తీర్మానం ఉంటుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నిన్న పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, సీఎల్పీ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు అందించడానికి వచ్చానని చెప్పారు.

సీఎల్పీ అభిప్రాయాన్ని నివేదించడం వరకే తన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి తదితర అంశాలపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. సాయంత్రం ఆయన హైద్రాబాద్​కు రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement