Thursday, May 16, 2024

సత్యేందర్ జైన్​కు ‘పద్మవిభూషణ్’ ఇవ్వాలి – సీఎం కేజ్రీవాల్

ప్రజలకు ఉచితంగా సేవలందించే ‘మొహల్లా క్లినిక్‌’ నమూనాను ఆవిష్కరించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన సత్యేందర్‌ జైన్‌కు పద్మవిభూషణ్‌ ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అన్నారు. తప్పుడు కేసు లో ఇరికించబడిన జైన్ ..కఠినమైన నిజాయితీపరుడు .. దేశభక్తుడని కేజ్రీవాల్ ప్రశంసించారు.. ED విచారణ తర్వాత మంత్రి క్లియర్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ UN సెక్రటరీ జనరల్‌తో సహా ప్రపంచం నలుమూలల నుండి వ్యక్తులు సందర్శించే మొహల్లా క్లినిక్‌ని స్థాపించినప్పటి నుండి దేశం అతని గురించి గర్వపడాల‌న్నారు..

ఆయనకు పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు ఇవ్వాలని నేను నమ్ముతున్నాను అని కేజ్రీవాల్ న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉంచాలని మంగళవారం కోర్టు ఆదేశించింది..మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ నిబంధనల కింద ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది.జైన్‌పై మోపిన వాదనలు “పూర్తిగా అవాస్తవం” అని కేజ్రీవాల్ గతంలో పేర్కొన్నారని, అభియోగాలు ఒక శాతం నిజమైతే, మంత్రిపై చర్య తీసుకునేవాడినన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement