Thursday, May 23, 2024

భారీగా పెరిగిన ధ‌ర‌లు : నెయ్యి రూ.605, వంట‌నూనె రూ.555లు

పాకిస్థాన్‌లో నెయ్యి, వంట నూనె ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కిలో వంటనూనె ధర రూ.208 పెరగ్గా.. నెయ్యి ధర రూ.213 మేర పెరిగింది. దేశంలో వంట నూనె, నెయ్యి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరాయని.. లీటర్ నూనె ధర రూ.555, లీటర్ నెయ్యి ధర రూ.605కి చేరిందని యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ (యూఎస్సీ) అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నార‌ని ఆ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement